క్రైమ్/లీగల్

స్వైన్‌ప్లూతో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, అక్టోబర్ 23: మండలంలోని శోభనాద్రిపురం గ్రామానికి చెందిన లోడె సురేష్ (28) స్వైన్‌ప్లూతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. నెల రోజులక్రితం తన స్నేహితునితో కలిసి గాంధీ ఆసుపత్రికి వెళ్లిన సురేష్ తదనంతరం జలుబు, దగ్గుసోకి అనారోగ్యానికి గురయ్యాడు. రోజురోజుకు అనారోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి స్వైన్‌ప్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించి చికిత్స కొనసాగిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి హైదరాబాద్‌లోనే మృతి చెందాడు. మంగళవారం కుటుంబ సభ్యులు స్వగ్రామమైన శోభనాద్రిపురంకు యువకుని మృతదేహాన్ని తీసుకవచ్చారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యులు స్వైన్‌ప్లూ నిర్ధారణకోసం మృతుని నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా స్వైన్‌ప్లూ లక్షణాలు బయటపడినట్లు తెలిపారు. మండలంలో మొదటిసారిగా స్వైన్‌ప్లూ మృతికేసు బయట పడడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వైద్యసిబ్బంది వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.