తెలంగాణ

టెన్త్ పేపర్ లీక్ ఘటనలో ముగ్గురి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, మార్చి 22: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లెపల్లి సాయిసిద్ధార్ధ పాఠశాల పరీక్షా కేంద్రంలో పదవ తరగతి తెలుగు రెండో పేపర్ లీకేజీ జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలపై డిఈవో విశ్వనాథరావు మంగళవారం ప్రాథమిక విచారణ జరిపిన పిదప ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసచారి, డిపార్ట్‌మెంటల్ అధికారి వెంకటేశ్వర్లు, తొమ్మిద నెంబర్ రూమ్ ఇన్విజిలేటర్ నిర్మలను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పాఠశాల వార్డెన్ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారని, పోలీసు కేసు నమోదైనందున విచారణ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.