ఆంధ్రప్రదేశ్‌

పౌరుషానికి ప్రతీక నరసరావుపేట: కేంద్రమంత్రి వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: పౌరుషానికి ప్రతీకగా నరసరావుపేట అని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నరసరావుపేట పురపాలక సంఘం శత వసంతాల వేడుకలో భాగంగా రెండోరోజు జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుతో కలిసి పట్టణంలో పర్యటించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల ద్వారా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, స్థానిక ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ కాల్వ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే పాల్గొన్నారు.