ఆంధ్రప్రదేశ్‌

కాపులను ముంచేసిన చిరంజీవి: మంత్రి నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ పెట్టి లక్షలాదిమంది కాపుల్లో ఆశలు రేకెత్తించిన సినీ నటుడు చిరంజీవి చివరికి కాంగ్రెస్‌లో చేరిపోయి తమ కులస్థులను నట్టేట ముంచేశాడని రాష్ట్ర మంత్రి నారాయణ ఆరోపించారు. ఇక్కడ టిడిపి మహానాడులో శనివారం ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రులుగా పదవులు అనుభవించిన దాసరి నారాయణరావు, చిరంజీవి కాపులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. తన ఉద్యమానికి సహకరించారంటూ దాసరి, చిరంజీవిలకు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కాపుగర్జన సందర్భంగా తుని వద్ద విధ్వంసానికి సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లభించడంతో ఇపుడు ముద్రగడకు కేసుల భయం పట్టుకుందన్నారు. ఈ విధ్వంసానికి సూత్రధారి జగన్, పాత్రధారి ముద్రగడ అని ఆయన వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్లను అమలు చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు.