తెలంగాణ

పట్టాలు తప్పిన రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలోని నాందేడ్-తిరుపతి ప్రత్యేక రైలు నెం. 07607 పట్టాలు తప్పింది. మంగళవారం రాత్రి గం. 20:27లకు ఈ సంఘటన చోటుచేసుకుంది.
మడ్‌ఖేడ్-శివన్‌గావ్ మధ్య రైలు పట్టాలపై ఓ సైకిల్ పడి ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదు. పట్టాలపై సైకిల్‌ను గుర్తించిన డ్రైవర్ అప్రమత్తతతో బ్రేక్ వేయగా రైలు పట్టాలు తప్పింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సంఘటనా సమాచారం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు.
హెల్ప్‌లైన్ నెంబర్లు..
నిజామాబాద్- 9701476401, 9096071756
నాందేడ్- 02462-242132, 02462- 223545, 02462-1072
గుంతకల్- 9676903466
తిరుపతి- 9676903528 నెంబర్లలో ప్రయాణికులు సంప్రదించవచ్చని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.