రాష్ట్రీయం

పార్లమెంటు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కరుణానిధి మృతికి నివాళులర్పించిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదే విధంగా ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలను ఒక రోజు వాయిదా వేశారు. వేరే రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి మరణిస్తే అసెంబ్లీని ఒక రోజు వాయిదా వేసిన సందర్భం అరుదు. పార్లమెంటు, రాష్టప్రతి భవన్‌పై జాతీయ పతాకాలను అవనతం చేసి, దివంగత నేతకు దేశం నివాళులర్పించింది.
ముంబయిలో తమిళ పాఠశాలకు చేయూత
ముంబయిలో తమిళ పిల్లలు మాతృభాష మర్చిపోకుండా ఉండేందుకు ఒక పాఠశాల ఏర్పాటుకు కరుణానిధి 35 ఏళ్ల క్రితం సహకరించారని, ఆర్థిక సహాయం చేశారని ముంబాయి డీఎంకే నేత ఆర్ పళనిస్వామి చెప్పారు. ధారవి ప్రాంతంలో తమిళులు ఎక్కువగా ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అవసరమైన సహాయం చేయాలని కరుణానిధి మంత్రులు, పార్టీ నేతలను ఆదేశించారని పళనిస్వామి గుర్తు చేసుకున్నారు. ముంబాయికి వచ్చినప్పుడు కరుణానిధి దాదర్, పార్సీ, జింఖానా, ఆదర్శనగర్‌మైదాన్, వర్లి ప్రాంతాల్లో ఉన్న తమిళులను పలుకరించేందుకు వచ్చేవారన్నారు. 1983 తర్వాత కరుణానిధి ముంబాయిని సందర్శించలేదన్నారు.