రాష్ట్రీయం

ఎన్‌ఐఆర్‌డి డిజిగా డబ్ల్యూఆర్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ రూరల్ డెవలప్‌మెంట్ ) నూతన డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యు ఆర్ రెడ్డి శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. కేరళ రాష్ట్రంలో అదనపు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న రెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేశారు. 2990-95లో కడప జిల్లా డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శిగానూ వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలోనూ, కేరళ రాష్ట్రంలో అనేక పదవుల్లో పనిచేశారు. ముఖ్యంగా మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండిగా, కానూరు జిల్లా కలెక్టర్‌గా, కొల్లాం జిల్లా కలెక్టర్‌గా, వ్యవసాయ శాఖ సంయుక్తకార్యదర్శిగా పనిచేశారు. రెడ్డి కర్నూలు జిల్లా అబ్దుల్లాపురం గ్రామానికి చెందినవారు.