శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మాట తప్పిన బీజేపీతో తెగతెంపులు హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, మార్చి 18 : రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ చివరకు మాట తప్పిన భారతీయ జనతాపార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం హర్షణీయమని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆదివారం షాదీమంజిల్ నిర్మాణ పనుల ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ముస్లిం, మైనార్టీ ప్రజల హక్కులను ధిక్కరిస్తూ బీజేపీ నాయకుల బాబ్రీ మసీదు విధ్వంస దుశ్చర్యను సైతం విభేదించి నిలిచిన ఏకైక జాతీయ నాయకుడు చంద్రబాబునాయుడని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న మైనార్టీ వర్గాల దయనీయమైన జీవన స్థితిగతులకు ప్రత్యక్షంగా బీజేపీ ప్రభుత్వమే కారణమని, ఆ పార్టీ నుంచి విడివడటంతో జాతీయ స్థాయిలో ముస్లిం ప్రజల మన్ననలను చంద్రబాబునాయుడు అందుకున్నారని చెప్పారు.