శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మంచినీటి సంప్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిట్రగుంట, మే 30: మంచినీటి సంప్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని కోవూరుపల్లిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అమ్మమ్మ, తాతయ్యల ఇంటి వద్ద వేసవి సెలవులు గడిపేందుకు వచ్చిన చిన్నారి బాలికలు బ్లేస్సి(6), మంగళవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సి వున్న నిస్సి(4) ఆడుకుంటూ ఇంట్లోగల మంచినీటి సంప్‌లో పడి ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచేసింది. ఆరు బయట ఆడుకుంటున్న వారిద్దరూ ఎంతకీ కనిపించకపోవడంతో తల్లి నీలం దివ్య, అమ్మమ్మ, తాత, వారి బంధువులు గాలించగా చివరికి ఇంట్లో వున్న నీటి సంప్‌లో పడి వుండటాన్ని గమనించి హుటాహుటిన 108 వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. కాగా, తండ్రి అనీల్ కావలి పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తాత రఘురామయ్య కలిగిరి ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు పెద్దసంఖ్యలో ఏరియా వైద్యశాలకు తరలివచ్చారు. సిఐ హర్షవర్ధన్‌రెడ్డి మృతదేహాలను పరిశీలించారు.