శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

టీ దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిట్రగుంట, జూలై 31: బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప జాతీయ రహదారి మార్జిన్ పక్కన ఉన్న టీ దుకాణంలోకి లారీ దూసుకుపోవడంతో ఇద్దరు మహిళలు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో టీ దుకాణం పెట్టేందుకు కర్రెద్దుల ప్రమీల (46), పీరిగ నిర్మలమ్మ సిద్ధమవుతుండగా కావలి నుండి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి టీ దుకాణంలోకి దూసుకుపోయి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రమీల అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన పీరిగ నిర్మలమ్మను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తరలిస్తుండగా మృతిచెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను కావలి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు బిట్రగుంట ఎస్సై టి వెంకటరమణ చెప్పారు.