ఆంధ్రప్రదేశ్‌

బీచ్‌లో గల్లంతైన వారి కోసం గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఇక్కడి సముద్రతీరంలో స్నానాలకు దిగి గల్లంతైన అయిదుగురు యువకుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కమ్యూనిటీ గార్డులు సకాలంలో స్పందించడం వల్ల మృతుల సంఖ్య తగ్గిందని మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఇటీవల బీచ్‌లో ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో వీటి నివారణకు మంత్రి గంటా అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. బీచ్‌లో రక్షణ చర్యలు పెంచాలని, ఈ ప్రమాదాలపై అందరికీ అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్, కోస్టుగార్డు, నేవీ అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంకు చెందిన కొంతమంది యువకులు ఆదివారం సాయంత్రం ఇక్కడి బీచ్‌కు వచ్చారు. స్నానానికి దిగిన వారిలో అయిదుగురు గల్లంతయ్యారు.