రాష్ట్రీయం
పటికబెల్లంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తులాభారం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 January 2016
కొత్తపేట, జనవరి 21: ఒక అభిమాని మొక్కును తీర్చేందుకు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం పటికబెల్లంతో తులాభారం తూగారు. నియోజకవర్గంలోని రావులపాలెంకు చెందిన పచ్చిపులుసు సుబ్బారావు అనే వ్యాపారి 2014 ఎన్నికల్లో జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే శ్రీ షిరిడీ సాయినాథునికి పటికబెల్లంతో తులాభారం వేసి సమర్పిస్తానని మొక్కుకున్నారు. కోనసీమ షిర్డీగా పేర్గాంచిన కొత్తపేట షిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారం ఆ మొక్కును సదరు భక్తుడు తీర్చారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన త్రాసులో ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని కూర్చోబెట్టి, పటికబెల్లంతో తులాభారం వేశారు. అనంతరం ఆ పటికబెల్లాన్ని ఆలయానికి సమర్పించారు.