రాష్ట్రీయం

పెళ్లయిన మూడురోజులకే ఎన్‌ఆర్‌ఐ మొగుడు పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ నగరంలో ఎన్‌ఆర్‌ఐల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని ఎల్‌బినగర్‌లో శ్రవణ్ కుమార్ అనే యువకుడు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా సంప్రదించి వరంగల్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు కట్నకానులతో ఘనంగా వివాహం జరిపించారు. అయితే పెళ్లి చేసుకున్న మూడు రోజులకే భార్యను వదిలేసి శ్రవణ్‌కుమార్ చెప్పాపెట్టకుండా యుకెకు వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై శ్రవణ్ తల్లిదండ్రులు కూడా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన యువతి సోమవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను కలసి ఫిర్యాదు చేసింది. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా సంబంధాలు కుదుర్చుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.