ఆంధ్రప్రదేశ్‌

పాఠశాల కరస్పాండెంట్ అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, జనవరి 23 : తినుబండారాలు కొనుక్కోవడానికి పాఠశాల నుండి బయటకు వెళ్లిన విద్యార్థిని కరస్పాండెంట్ కిరాతకంగా చితకబాదిన సంఘటన శనివారం ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో చోటుచేసుకుంది. గౌతమీ గ్రామర్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న వెదురు శ్రీనివాసరెడ్డి సాయంత్రం స్టడీ అవర్‌లో రెండవ బెల్‌కొట్టడంతో పక్కనే ఉన్న బడ్డీకొట్టులో బోండాలు కొనుక్కోవడానికి బయటకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది నాయక్ విద్యార్థిని తీసుకొచ్చి పాఠశాల కరస్పాండెంట్ రాజకేశవరెడ్డికి అప్పగించారు. దీంతో విద్యార్థిపై మండిపడ్డ రాజకేశవ రెడ్డి తన వద్ద ఉన్న వెదురు కర్రతో ఇష్టానుసారంగా చితకబాదాడు. దీంతో విద్యార్థి రెండు చేతులు లేపలేని పరిస్థితి, ఒంటి నిండా వాతలు పెట్టి హింసించాడు. తోటి విద్యార్థులు ఈ విషయాన్ని విద్యార్థి తల్లి సుభాషిణికి విషయాన్ని చేరవేయడంతో విద్యార్థి తల్లి తన కుమారుడిపై పాఠశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లి సుభాషిణి మాట్లాడుతూ పాఠశాల నుండి బయటకు వెళితే హెచ్చరించి వదిలివేయాలి కాని గొడ్డును బాదిన విధంగా బాదుతారా.. అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. విద్యార్థి శ్రీనివాసరెడ్డిని వైద్యశాలకు తరలించారు.