రాష్ట్రీయం

పాపికొండ యాత్ర పడవలో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీపట్నం: పాపికొండల యాత్రకు వెళ్లిన ఓ పడవలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. పోశమ్మ గుడి నుంచి బయలుదేరిన కొద్ది సమయం వ్యవధిలోనే మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి వెంటనే ఈదుకుంటూ వచ్చి ప్రయాణీకులను రక్షించారు. పడవలో 80మంది ప్రయణీకులు ఉన్నారు. వీరిలో కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారు. మంటలు చెలరేగిన విషయం గుర్తించిన స్థానికులు ఈదుకుంటూ వచ్చి ప్రయాణీకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అధికారులు హుటాహటిన సంఘటన స్థలానికి చేరుకుని మిగిలిన ప్రయాణీకులను సైతం స్థానికుల సహయంతో రక్షించారు.