రాష్ట్రీయం

పీలేరులో వైద్యురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు:చిత్తూరు జిల్లా పీలేరులో శిల్ప(30) అనే వైద్యురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పీలేరు మండలం బాలంవారిపల్లెకు చెందిన రాజగోపాల్ కుమార్తె శిల్ప (30) తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో చిన్న పిల్లల వైద్య విభాగంలో ఇటీవల పీజీ చేశారు. కళాశాలలోని అధ్యాపకులు తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై ఇటీవల ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ నివేదిక గవర్నర్ కార్యాలయానికి చేరింది. ఈ నేపథ్యంలో శిల్ప పీజీ పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు తెలియటంతో తీవ్ర మనస్తాపానికి గురై తన గదిలో నైలాన్ తాడుతో ఉరేసుకుని చనిపోయింది. వేధింపులు విషయంలోనూ న్యాయం జరుగలేదని ఎన్నోసార్లు సన్నిహితుల వద్దనూ, మీడియాతోనూ తన ఆవేదన తెలియజేసింది. కాగా శిల్ప భర్త రూపేశ్‌కుమార్ రెడ్డి ఎముకుల వైద్యునిగా పనిచేస్తున్నారు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.