ఆంధ్రప్రదేశ్‌

పార్లమెంట్‌ను స్తంభింపచేయండి: పవన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఎపికి ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించారు. రాజకీయ పార్టీ లక్ష్యం ప్రజాశ్రేయస్సు అని, పోరాటంలో తాను గెలవొచ్చు.. ఓడిపోవచ్చు.. వెనకడుగు వేయనని స్పష్టం చేశారు. తిరుపతిలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గోసంరక్షణ చేయాలంటే ప్రతి భాజపా కార్యకర్త ఒక ఆవును పెంచుకోమనండని పవన్‌ సూచించారు. గోమాత పేరుతో సమస్యలను గాలికి వదిలేయవద్దని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అంటే తనకు అమితమైన గౌరవం ఉందని అయితే అది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేంత తనకు లేదన్నారు. గతంలో కాంగ్రెస్‌ ఎంపీలు మేడమ్‌.. మేడమ్‌.. అని బతిమలాడేవారని, ఇప్పుడు ఎంపీలు సార్‌.. సార్‌.. అని బతిమలాడుతున్నారని పవన్‌ విమర్శించారు.