ప్రకాశం

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, మే 10: వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక దేవరపల్లి గ్రామానికి చెందిన ఎం బుల్లిబాబు(42) రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక ఎస్సై జి సోమశేఖర్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు మృతుని భార్య అనిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు బుల్లిబాబు 9 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, శనగ పంటలు సాగు చేశాడని దానికోసం అయిన అప్పులు తీర్చలేక పొలం వెళ్లి వస్తానని చెప్పి పొలంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని బంధువులు మొదట చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు గుంటూరు తరలించమని చెప్తే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి లోనే మృతి చెందినట్లు ఎస్సై జి సోమశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారించిన అనంతరం పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.