ప్రకాశం

నవరత్నాలతోనే అభివృద్ధి :బాలినేని వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 21:తమపార్టీ రూపొందించిన నవరత్నాలతోనే అభివృద్ధి సాధ్యమని వైకాపా ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం జగన్ రావాలి... జగన్ కావాలి.... కార్యక్రమంలో భాగంగా స్థానిక 24వ డివిజన్‌లోని వడ్డిపాలెం, మంగలపాలెం, గంటాయపాలెంలో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ నవరత్నాలు అమలు ద్వారా ప్రతి ఇంటికి ఏడాదికి లక్ష నుండి ఐదు లక్షల వరకు లబ్ధి చేకూర్చుతుందన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ద్వారా ఏటా లక్ష నుండి లక్షన్నర వరకు , ఆరోగ్య శ్రీ ద్వారా లక్ష నుండి పది లక్షలు, పెన్షన్ పెంపు ద్వారా 24 వేల నుండి 48 వేలు, పేదలకు సొంత ఇల్లు ఏర్పాటు చేయడం ద్వారా రెండు నుండి ఐదు లక్షలు, వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా 50 వేలు, వైయస్ ఆర్ చేయూత ద్వారా 75 వేలు, అమ్మవడి పథకం ద్వారా ఏటా 15 వేల చొప్పున ప్రతి కుటుంబానికి లబ్థి చేకూరేలా నవరత్నాలను రూపొందించినట్లు బాలినేని వివరించారు. ఇంకా వైయస్ ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా 12 వేల 500 నుండి లక్ష రూపాయల వరకు ప్రయోజనం చేకూరుతుందని బాలినేని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, పార్టీ అధికార ప్రతినిధి బి బ్రహ్మానందరెడ్డి, మహిళా అధ్యక్షురాలు జి సుజాత, పి ప్రభావతి, పి అనురాధా, అరుణ, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కెవి ప్రసాద్, నాయకులు వేమూరి బుజ్జి, బిసి సెల్ నాయకులు కె శంకర్, వైకాపా జిల్లా నాయకులు కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, పి సోమశేఖర్, ఎం రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.