ప్రకాశం

రాష్ట్భ్రావృద్ధి బిజెపితోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, మే 26: రాష్ట్భ్రావృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దేశప్రధానిగా నరేంద్రమోదీ రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం జిల్లా భారతీయజనతాపార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు, కలెక్టరేట్ నుండి పార్టీ కార్యాలయం వరకు భారీ మోటారుసైకిల్ ర్యాలీని నిర్వహించారు. ముందుగా జిల్లాపార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి భారీకేక్ కట్‌చేసి పార్టీశ్రేణులకు పంచిపెట్టారు. ఈసందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల మోదీ పరిపాలనలో అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో తమ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన హామీలను రాష్ట్రానికి తూచ తప్పకుండా అమలుచేస్తుందన్నారు. ఇచ్చిన నిధులను సక్రమంగా వాడితే రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇప్పటికే టిడిపి నేతలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వటం లేదని విమర్శలు చేయటం అర్థరహితమన్నారు. రాజధాని నిర్మాణంతోపాటు లోటుబడ్జెట్‌కు నిధులు కేటాయిస్తూ రాష్ట్భ్రావృద్ధికి భాగస్వామ్యం అవుతున్న తమపార్టీకి ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. టిడిపి నేతలు విమర్శలు మానుకుని రెండుపార్టీల నాయకులు సమన్వయంతో ముందుకువెళ్తే రాష్ట్భ్రావృద్ధి పూర్తిస్థాయిలో సాధ్యవౌతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జిల్లాలో పార్టీని బలోపేతం చేయటమే తమముందున్న ప్రధానలక్ష్యమన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, ఖలీఫాతుల్లాబాషా, జిల్లా నాయకులు విన్నకోట సురేష్, మంగిశెట్టి వెంకటేశ్వర్లు, శివాజి, హరికృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.