ప్రకాశం

విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నలూరు, జూన్ 9: మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చాగంరెడ్డి ఇంద్రసేనారెడ్డి (10) ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. చాగంరెడ్డి జయరామిరెడ్డి, పార్వతిల మొదటి సంతానం అయిన ఇంద్రసేనారెడ్డి తన స్నేహితులు నలుగురితో కలిసి గొరిశలేరువాగులో రైతులు మేత కోసం జెసిబితో తీసిన గుంతలో సరదాగా ఈతకు దిగారు. ఈ నేపథ్యంలో ఈత కొడుతుండగా ఇంద్రసేనారెడ్డి పూడికలో ఇరుక్కుపోగా, పక్కనే ఉన్న పిల్లలు కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి కేకలు విని బాలుడిని బయటకు తీయగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తల్లి పార్వతి ఈ రోజు మంచి రోజు అని ఉదయానే్న ఇంద్రసేనారెడ్డికి తల స్నానం చేయించి మంచి దుస్తులు ధరింపచేసి పక్కనే ఉన్న అగ్రహారంలో ఓ ప్రైవేటు పాఠశాలకు బస్సులో పంపించింది. తిరిగి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చిన తన కొడుకు శవంగా కనిపించడంతో ఆ కన్నతల్లి బాధ చుట్టుప్రక్కల వారిని కదిలించివేసింది. విషయం తెలుసుకున్న తాత చాగంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు కె శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.