ప్రకాశం

డివైడర్ ఢీకొని ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, అక్టోబర్ 7: డివైడర్ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శింగరాయకొండకు చెందిన సుదర్శి పాపయ్య (25) అతని భార్య వాణి శుక్రవారం మద్దిపాడు మండలంలోని ఇనమనమెళ్లూరు గ్రామానికి వెళ్లి తిరిగి శింగరాయకొండకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సుదర్శి పాపయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వాణికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు పోలీసులు తరలించారు. గుంటూరు రేంజి ఐజి ఎం సంజయ్ ఆ సమయంలో ఒంగోలు నుండి గుంటూరుకు వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వెంటనే ఐజి కారు దిగి తాలూకా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.