రాష్ట్రీయం

నిధుల గోల్‌మాల్‌పై నిజాలు వెలికితీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాత చదలవాడ డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 12: నిర్మాతల మండలిలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలు వచ్చాయని, ఇందులో నిజానిజాలు వెలికితీసేందుకు ఒకరిని ఎన్నుకుని బాధ్యత అప్పగించాలని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం నిర్మాతల మండలి కార్యనిర్వాహక సభ్యులతో సమావేశం నిర్వహించారు. నిధుల దుర్వినియోగంపై ఒక నిర్మాత ఆరోపణలు చేశారని, దీనిపై నిర్మాతల మండలిలోని రెండువేల మంది సభ్యులకు సమాచారం అందించామని ఆయన చెప్పారు. ఆ తరువాత ఇసి మీటింగ్ జరిగిందని అన్నారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి సారథ్యంలో ఈ అంశంపై విచారణ జరపాలని కొందరు సూచించారని, ఈ విషయంలో తమకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే దానికిబదులు సభ్యులలో ఒకరిని ఎన్నుకుని వారికి ఆ బాధ్యత ఇస్తే బాగుంటుందన్నది తమ అభిప్రాయమని, ఈ సూచనను పరిశీలించాలని ఆయన కోరారు. కాగా మరో సభ్యుడు మోహన్ గౌడ్ మాట్లాడుతూ నిర్మాతల మండలిలో రూ. 3 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, నిధులను జనరల్ బాడీకి బదిలీ చేసి వినియోగించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సభ్యులు బసిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంగిరెడ్డి దశరథ్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.