రాష్ట్రీయం

కేంద్రంపై టీడీపీ దుష్ప్రచారం: పురందేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలవరం ప్రాజెక్టుకు సహకరించలేదని కేంద్రంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. విజయవాడలో మంగళవారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘పోలవరానికి 1935 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నివేదిక ఇంకా కేంద్రానికి అందలేదని, పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీనని, పోలవరం కోసం బీజేపీ చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. సిమెంట్ రోడ్లు, 24 గంటల కరెంట్ కేంద్రం ఇస్తుంటే.. చంద్రబాబు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.