ఆంధ్రప్రదేశ్
పుష్కరాలపై ప్రత్యేక గీతాలు, కళాజాతలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 July 2016
విజయవాడ: ఆగస్టు 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు విస్తృత ప్రచారం చేసేందుకు ఎపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కృష్ణా పుష్కరాల ప్రాశస్త్యాన్ని వివరించేలా ప్రత్యేక గీతాలను విడుదల చేసేందుకు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సినీ ప్రముఖులను కలుస్తున్నారు. సినీ గేయరచయిత జొన్నవిత్తుల, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్లను ఆయన శుక్రవారం కలిసి ప్రత్యేక గీతాల గురించి చర్చించారు. అన్ని జిల్లాల్లోనూ కళాజాతలు నిర్వహించాలని నిర్ణయించారు. పుష్కరాల సమయంలో అధికారులు ఏ మాత్రం అలసత్వం చూపకుండా విధులు నిర్వహించాలని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.