ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరు లాలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై 160 కి.మీ వేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని తరువాత లారీని ఢీకొన్నది. కారులో ఉన్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. వీరు ఆర్‌వీఆర్ ఆండ్ జేసీ ఇంజనీరింగ్ విద్యార్థులు. కారు ఢీకొనటంతో లారీ సైతం బోల్తా పడింది. మృతులు ధనుష్, కోటేశ్వరరావు, సాయిరామ్, కపూర్‌గా గుర్తించారు. లారీ డ్రైవర్, క్లీనర్‌కు సైతం గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.