ఆంధ్రప్రదేశ్
కారును ఢీకొన్న లారీ: అయిదుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 30 June 2016
ఒంగోలు: రోడ్డుపై ఆగిఉన్న కారును ఓ లారీ ఢీకొట్టడంతో నలుగురు చిన్నారులు సహా డ్రైవర్ మరణించిన ఘటన ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద గురువారం తెల్లవారు జామున జరిగింది. మేదరమెట్ల బైపాస్ రోడ్డులో మరమ్మతుల కోసం కారును డ్రైవర్ నాగరాజు ఆపాడు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఆ కారును ఢీకొంది. డ్రైవర్ నాగరాజుతో పాటు శ్రీకృష్ణ, చిన్నికృష్ణ మనోహర్, చిన్నికృష్ణ వాసవి, నిత్య అనే చిన్నారులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురు గాయపడ్డారు. పాత గుంటూరుకు చెందిన వీరాస్వామి తన మనవరాలికి తిరుపతిలో పుట్టువెంట్రుకలు తీయించి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ దారుణం జరిగింది.