బిజినెస్

సీఎం ఇంటి సమీపంలో మళ్లీ కార్చిచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజ్‌సర్కిల్), మార్చి 11: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసముంటున్న ఉండల్లి గ్రామ సమీపంలోని కొండలపై అగ్గి రాజుకుంది. రాష్టవ్య్రాప్తంగా అడవులు, చెట్లు విస్తృతంగా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించిన మూడోరోజే ఆయన ఇంటికి సమీపంలోని కొండలు కార్చిచ్చుతో తగలబడిపోతున్నాయి. కొందరు ఆకతాయిల చర్యల వల్ల ఆదివారం కొండలు తగులబడటంతో అటవీ సంపదకు నష్టం జరుగుతోంది. కొండ ప్రాంతంపై గడ్డి తగులబడటంతో కొండల అడవుల్లో నివసించే చిన్నచిన్న జంతువులు సైతం మంటల్లో ప్రాణాలు కోల్పోయి వాటి మనుగడకే ప్రమాదం ఏర్పడుతోంది. ఉండవల్లి కొండపై కుందేళ్లు అధికంగా జీవిస్తుంటాయి. కోతులు సైతం ఈ కొండను ఆవాసంగా మార్చుకున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన పద్మనాభ స్వామి ఆలయంతో పాటు గుహలు కూడా ఇదే కొండపై ఉన్నాయి. కొండకు ఆనుకుని పెద్దసంఖ్యలో బడుగు, బలహీన వర్గాల కుటుంబాలు కూడా జీవనం సాగిస్తున్నాయి. కొండకు అంటుకున్న మంటలు మరింత వ్యాప్తిచెందితే పరిస్థితి చేజారే ప్రమాదముంది. మంటలు రేగటంపై సంబంధిత శాఖతో పాటు పోలీసు శాఖ కూడా స్పందించలేదు. తరచూ ఇక్కడ తిరిగే ఆకతాయిలే కొండలకు నిప్పంటిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి నివాసముంటున్న గ్రామంలో ఇలాంటి సంఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కార్చిచ్చులో దగ్ధమవుతున్న కొండ ప్రాంతం

సమరానికి సన్నద్ధం

నేటినుంచి తెలంగాణ అసెంబ్లీ భేటీ వ్యూహ, ప్రతివ్యూహాల్లో అధికార, ప్రతిపక్షాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 11: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువున్నందున సభలను వేదిక చేసుకునేందుకు పాలక, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి.
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించనున్నట్లు సమాచారం. అలాగే, ప్రతి రోజూ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రజలను ఆకర్షించాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నిర్ణయించింది. అయితే ఎన్నికలకు ముందు ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ కాబట్టి ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయంలో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టేందుకు అవకాశం లేదు కాబట్టి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టి ఆమోదిస్తుంది. అంటే ఆరు నెలల కోసమే బడ్జెట్ పెడుతుంది. చివరి బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలతో ప్రజలకు మరింత చేరువ కావలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమవుతూ బడ్జెట్ తయారీలో బిజీ బిజీగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు చేసే నిరాధార ఆరోపణలు, విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రతి రోజూ ఎమ్మెల్యేలంతా సమావేశాలకు హాజరుకావాలని, సభలోనే ఉండాలని ఆయన ఆదేశించారు.
25 అస్త్రాలతో కాంగ్రెస్
ఇలాఉండగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 25 అస్త్రాలతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమైంది. రెండు రోజుల క్రితం జరిగిన సీఎల్పీ భేటీలో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రజా సమస్యలను, ప్రభుత్వం నెరవేర్చని హామీలను సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం, ఆగిన రైతుల ఆత్మహత్యలు, ఫీజు రీయంబర్స్‌మెంట్, నీటి పారుదలరంగంలో అవినీతి, ముస్లింలకు, గిరిజనులకు కల్పిస్తామన్న రిజర్వేషన్లపై ప్రభుత్వం విఫలం కావడం వంటి అనేక సమస్యలతో జాబితా రూపొందించింది. మరోవైపు బీజేపీ సైతం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమైంది. దీంతో సుమారు నెలపాటు జరిగే బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే అవకాశం కనిపిస్తోంది.