రాష్ట్రీయం

వేడుకగా ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 9: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ధ్వజారోహణం వేడుకగా జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు దేవరాత్రిని పురస్కరించుకుని వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, గంగాదేవి సమేత సోమ స్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబ, చండికేశ్వరుడు పంచమూర్తులను పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తులను ఆలయంలోని స్వామివారి ధ్వజ స్తంభం చుట్టూ కొలువుదీర్చారు. అర్చకులు, వేద పండితులు హోమం నిర్వహించారు. ధ్వజ స్తంభానికి అభిషేకం చేసి, దర్బలతో తయారు చేసిన దారాన్ని అలంకరించారు. అనంతరం భక్తులు సమర్పించిన చీరలను ధ్వజస్తంభానికి అలంకరించారు. ఆ తరువాత అఖండ దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లా దేవస్థానం ట్రస్టుబోర్డు మాజీ అధ్యక్షులు పీఆర్ మోహన్, శాంతారాంజే పవార్, శివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి రఘునాథ్, ఈఓ భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం తిరిగి వెండి అంబారీలపై పట్టణంలో ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరిగింది.