రాష్ట్రీయం

‘స్వాతంత్య్ర సమరయోధులకు రాజకీయాలు అంటగట్టొద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటివారికి రాజకీయాలను అంటడగట్టడం మానుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) జాతీయ కార్యవర్గసభ్యుడు ఎం.రాఘవేందర్ హితవు పలికారు. కేంద్రప్రభుత్వం కోట్లాది మంది భారతీయుల ఆకాంక్ష మేరకు నేతాజీ మరణానికి సంబంధించిన రహస్య ఫైళ్లను బహిర్గతం చేస్తే దానికి రాజకీయం అంటగట్టడం విచారకరమని అన్నారు. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఫైళ్లు నకిలీవంటూ ఉద్దేశ్యపూర్వకంగానే ఎఐసిసి అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ వ్యాఖ్యానించారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆనంద్‌శర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాఘవేందర్ మాట్లాడుతూ బోస్ రహస్య ఫైళ్లను బహిర్గతం చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఏడేళ్లగా రహస్య ఫైళ్లను బహిర్గతం చేయడానికి సాహసించని కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగడం సిగ్గుచేటని అన్నారు.