ఆంధ్రప్రదేశ్‌

జగన్ పోరాటమంతా చంద్రబాబు మీదనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 9: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి కుటిల రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రం మీద పోరాడాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జగన్ తీరుపై మంత్రి రవీంద్ర నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద మాత్రమే పోరాటం చేయడం వల్ల జగన్ నీతి ఏమిటో తెలుస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటిస్తే జగన్ కేంద్రాన్ని విమర్శించకుండా చంద్రబాబును విమర్శించడంలో అంతర్యమేమిటో చెప్పాలన్నారు. ఆది నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతోందన్నారు. పార్లమెంట్ సమావేశాలను సైతం తమ పార్టీ ఎంపీలు స్తంభింపచేస్తుంటే వైసీపీ ఎంపీలు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ లోపల ఒక మాట, వెలుపల ఒక మాట చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. మోదీని విమర్శించే సత్తా జగన్‌కు లేదని విమర్శించారు.