ఆంధ్రప్రదేశ్‌

బెజవాడలో సింధు, గోపీచంద్‌లకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పివి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌లకు మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సింధు, గోపీచంద్, ఆమె తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఎంపీలు మాగంటి బాబు, మురళీమోహన్, ఎపి ఒలింపిక్ సంఘం ప్రతినిధులు, క్రీడాసంఘాల ప్రతినిధులు సింధుకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో సింధు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు ర్యాలీ బయలుదేరింది. విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ పొడవునా సింధుకు స్థానికులు అభినందనలు తెలిపారు.