రాష్ట్రీయం

శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: శ్రీదేవికు ఇష్టమైన కంచిపట్టు చీరలోనే అంతిమ యాత్రకు ముస్తాబు చేశారు. అంత్యక్రియల కోసం శ్రీదేవి పార్థీవదేహన్ని అందంగా అలంక‌రించారు. నుదటన ఎర్రటి తిలకం దిద్దారు. మెజాంటా రంగు ఉన్న కంచి పట్టు చీరను కట్టారు. ఆమె మెడలో అందమైన ఆభరణాలు కూడా ఉన్నాయి. మల్లెపువ్వులు కూడా ఆమె పక్కనే పెట్టారు. శవపేటికను కూడా అందంగా అలంకరించారు. అంతిమయాత్రకు భారీగా ఏర్పాట్లు చేశారు. పవన్‌హన్స్ శ్మశానవాటిక‌ వైపు అంతిమయాత్ర వెళ్తోంది. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్ తారలతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ముంబైకి తరలివెళ్లారు. ఆమె భౌతికకాయానికి జాతీయ జెండాను కూడా కప్పారు. ఆమె భౌతికకాయాన్ని తరలిస్తున్న వాహనాన్ని పూర్తిగా తెలుపురంగు పూలతో అలంకరించారు. శ్రీదేవికి తెలుపు రంగంటే చాలా ఇష్టమట. అందుకే అంతా తెలుపు రంగు పూలతో అలంకరించారు. ఆమె భౌతికకాయం వెంట భర్త బోనీకపూర్, అర్జున్ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.