రాష్ట్రీయం

శ్రీశైలంలో భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, డిసెంబర్ 7: కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. భక్తులు తెల్లవారు జామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెల్లవారు జామున 4.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. సుమారు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం గుడి ముందుభాగంలోని గంగాధర మండపం, పాతాళగంగ వద్ద భక్తులు కార్తీకదీపాలు వెలిగించారు.