రాష్ట్రీయం

రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శి డా.రంగారావు మృతి పట్ల సీఎం సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: ప్రముఖ వైద్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎపి రంగారావు (75) ఆదివారం మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసారు. పేదలకు వైద్య సేవలు అందించడానికి, ప్రభుత్వపరంగా వైద్య సేవలను విస్తరించడానికి రంగారావు జీవితాంతం కృషి చేసారని సీఎం కొనియాడారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న 108, 104 వైద్య సేవల వ్యూహకర్త రంగారావేనని సీఎం గుర్తు చేసారు. ప్రజా వైద్య సేవల అంశంలో ప్రభుత్వానికి ఆయన సలహాదారునిగా వ్యవహరించారన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన ఎంపి రంగారావు కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా ఆదివారం ఉద యం హైదరాబాద్‌లో మృతి చెందారు.