రాష్ట్రీయం

నిప్పుల కొలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/విశాఖపట్నం ఏప్రిల్ 17: రానున్న ఐదురోజుల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ మంగళవారం హెచ్చరించింది. ఏప్రిల్ 18 నుంచి 20 వరకూ పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో 41 డిగ్రీలు నమోదు కావచ్చు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ నమోదు కావచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో 42 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
40 డిగ్రీలకు పైనే
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో మంగళవారం 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు 42 డిగ్రీలు, అనంతపురం 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్రలో విజయవాడ 39 డిగ్రీలు, నెల్లూరు 38 డిగ్రీలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.