రాష్ట్రీయం

పరివర్తనకే ఫ్రంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ‘కొంతమంది తెలిసో, తెలియకో 2019 ఎన్నికల్లో అధికారం కోసమో, పదవుల కోసమో ఏర్పాటు చేస్తున్న ఫ్రంట్‌గా భావిస్తున్నారు. దీన్ని చిల్లర రాజకీయాల కోణంలో కాకుండా దేశ హితం కోరి చేస్తోన్న ప్రయత్నంగా చూడాలి’ అని తెరాస అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తమ ప్రయత్నాన్ని మీడియా థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్‌గా అభివర్ణించడం సరికాదని హితవు పలికారు. తొందర, తత్తరపాటు ఎందుకు? రెండు, మూడు నెలలు ఆగితే స్పష్టమైన విధానంతో ఫ్రంట్‌ను ప్రజల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ప్రగతి భవన్‌లో బుధవారం సమాజ్‌వాది అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో తన నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్న ఫ్రంట్‌పై చర్చల అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయ ప్రక్రియలో గుణాత్మక మార్పు తీసుకరావాలంటే ఎంతో ప్రయాసతో కూడుకుంది తప్ప ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. ఎంతో శ్రమతో కూడుకుందన్నారు. ఇంకా ఎన్నో పార్టీలను కలవాల్సి ఉందని, అందరితో మాట్లాడి ఒప్పించాల్సి ఉంటుందన్నారు. ఇది ఏ ఒక్కరో చేసే పనికాదన్నారు. తమ ప్రయత్నానికి ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా ఎలా ముందుకు వెళ్లాలి, ఏ చేయాలి అనే దానిపై చాలా మందితో చర్చించాల్సి ఉందన్నారు. ఈ ప్రయత్నాల్లో ఎవరు కూడా తమకు అంటరాని వారులేరన్నారు. అందరితో చర్చించిన తర్వాతనే పూర్తిస్థాయి ఎజెండాతో రెండు, మూడు నెలల్లో ప్రజల ముందుకు వస్తామన్నారు. అప్పటి దాకా వేచి చూడాలని, తొందరపడి దీనిని మూడవ ఫ్రంట్, నాలుగవ ఫ్రంట్‌గా అభివర్ణించవద్దని మీడియాకు కేసీఆర్ సూచించారు. మున్ముందు తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నానని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రెండు, మూడు దశాబ్దాల కిందట భారతదేశాని కంటే ఎంతో వెనుకబడి ఉన్న చైనా, కొరియా, సింగపూర్, మలేషియా ప్రస్తుతం ఎంతో ఆర్థికాభివృద్ధి సాధించగలిగాయన్నారు. అన్ని వనరులు ఉండి కూడా భారత్ ఎందుకు వెనుకబడడానికి గత ప్రభుత్వాలు కారణం కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావాలన్న ఆలోచనలోంచి జనించిందే ఫ్రంట్ అన్నారు. సిలికాన్ వ్యాలీలో మన దేశ యువత ఎంతో రాణిస్తునప్పుడు, ఇక్కడేందుకు వారి శక్తిని వినియోగించుకోవడం లేదన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, పరివర్తనను తీసుకరావడానికి నెల రోజులుగా తన ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. దీంట్లో భాగంగానే కోల్‌కత్తా వెళ్లి మమత బెనర్జీతో, బెంగళూరు వెళ్లి దేవెగౌడతో, చెన్నై వెళ్లి డిఎంకేతో చర్చించిన సారాంశాన్ని ఎప్పటికప్పుడు అఖిలేష్‌తో పంచుకుంటున్నట్టు కేసీఆర్ వివరించారు.