రాష్ట్రీయం

ఇంజనీరింగ్‌లో 15వేల సీట్ల కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మరింత తగ్గేలా ఉంది. గత ఏడాది మేనేజిమెంట్ కోటా, ఇతర మైనార్టీ కాలేజీల్లోని సీట్లు 1,24,239 కాగా ఈ ఏడాది ఈ సీట్ల సంఖ్య 1,10,117కు తగ్గనున్నాయి. గత ఏడాది కన్వీనర్ కోటా సీట్లు 87 వేలు కాగా, ఈ ఏడాది కన్వీనర్ కోటా 80 వేల కంటే తక్కువ కానున్నాయి. 14 కాలేజీలకు ఈ ఏడాది ఎఐసిటీఇ అనుమతి నిరాకరించింది. మరో 9 కాలేజీలు నిర్వహణ భారంతో మూతకు సిద్ధమయ్యాయి. ఫార్మసీ, ఎంబిఎ, ఇంజనీరింగ్ కోర్సులను నిర్వహించే 297 కాలేజీలు ఈసారి అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేశాయి. సౌకర్యాలు కల్పించడంపై నిర్బంధం విధించడం, అదే విధంగా ఫ్యాకల్టీకి, విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో చాలా కాలేజీలు కోర్సులు నిర్వహించలేని పరిస్థితి వచ్చాయి. కొన్ని కాలేజీలు తమ లోపాలు సరిదిద్దుకుంటామని గడువు కోరడంతో వాటికి గడువు ఇచ్చారు. అయితే ఆ లోపాలను సరిదిద్దాయో లేదో పరిశీలించేందుకు అప్పీలు కమిటీలను నియమించారు. ఈ కమిటీలు పరిశీలించిన తర్వాత వాస్తవ స్థితి తెలుస్తుందని జెఎన్‌టియుహెచ్ వీసీ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
గత మూడేళ్లలో వరుసగా తనిఖీల పేరుతో కాలేజీలపై ఉక్కుపాదం మోపిన యూనివర్శిటీ సౌకర్యాలు లేవనే సాకుతో 63వేల సీట్లు కోత విధించింది. కాలేజీల యాజమాన్యాలు మాత్రం తమకో రూలు, యూనివర్శిటీకి ఒక రూలా అంటూ వాదిస్తున్నాయి.