రాష్ట్రీయం
ఉద్యోగా.. రాజకీయ నేతా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 May 2018
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 9: కర్నాటక ఎన్నికల్లో ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్షుడు పీ అశోక్బాబు గత ఆదివారం బీజేపీకి వ్యతిరేకంగా, అందునా ప్రధాని మోదీని కించపరిచేలా ప్రచారం సాగించారంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు వేర్వేరుగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఫిర్యాదులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలను ఉల్లంఘించినందుకు, అలాగే ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు అశోక్బాబుపై చర్చలు తీసుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్ రాంభట్ల, రాష్ట్ర నేత ఆంజనేయరెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు.