రాష్ట్రీయం

నేరస్థులకు రక్షణ.. మాఫియాకు కాపలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 9: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేరస్థులకు అండగా నిలిచి దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. బుధవారం వరంగల్‌లో తెలంగాణ సాయుధ పోరాటయోధులు అప్పన్న-కమలమ్మల కాంస్య విగ్రహాన్ని అవిష్కరించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని అసాంఘిక శక్తులకు, మాఫియాలకు అడ్డాగా మార్చారని దుయ్యబట్టారని అన్నారు. మోదీ తనకు వ్యతిరేకులపై కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేసి దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై కేసీఆర్‌ను సమీక్షిస్తునే మరో వైపు టెలిఫోన్ ట్యాంపరింగ్‌పై అదే కేసీఆర్‌పై కేసు పెట్టడానికి కుట్ర పన్నుతున్నాడని దుయ్యబట్టారు. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న బీజేపీ జాతీయ అథ్యక్షుడు అమిత్‌షాను జైలుకు పంపకుండా కాపాడుతున్నాడని విమర్శించారు. మోదీకి దమ్ము, ధైర్యం ఉంటే ఉంటే చంద్రబాబు, కేసీఆర్, అమిత్‌షా, జగన్‌లను జైల్‌కు పంపాలని డిమాండ్ చేశారు. దేశంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక మాఫియా, మైనింగ్ మాఫియా నేరస్థులను కాపాడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ సొంత నాణేలను ముద్రించుకుని మరో నిజాంలా వ్యవహారిస్తున్నాడని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శ చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు.