రాష్ట్రీయం

తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 10: తిరుమలలో గురువారం హనుమజ్జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకం చేపట్టారు. టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఈ అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న శ్రీబేడి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడి స్వామివారిని దర్శింకుంటున్నారన్నారు. జాపాలి తీర్థంలోని ఆంజనేయస్వామిని కూడా భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారని చెప్పారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కాలినడకన వచ్చే భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారని, ప్రసాదాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.