రాష్ట్రీయం

శ్రీవారి సేవలో అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 11: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆలయంలోకి చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు సాదర స్వాగతం పలికి దగ్గరుండి వారికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అమిత్ షా కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్, తిరుమల జేఈవోలు తీర్థప్రసాదాలు, శేషవస్త్రం బహూకరించారు. ఇదిలావుండగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.
వీరిలో ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ మంత్రి స్వతంత్ర దేవ్‌సింగ్, ఎంపీ తోట నరసింహం, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి సి రామచంద్రయ్య తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.