రాష్ట్రీయం

సోదరుడి వరుస.. అయనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 25: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు గుంటూరు జిల్లా దాచేపల్లి కేంద్రంగా మారుతోంది. ఇటీవల వరుస అత్యాచారాలతో ఆందోళనలు అట్టుడికిన నేపథ్యంలో తాజాగా జెడ్పీటీసీ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ బాధితురాలు జిల్లా రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు, మంత్రుల వద్ద వాపోయింది. సోదరి వరుస అయిన తనను దాచేపల్లి జెడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడని ముత్యాలంపాడుకు చెందిన మహిళ మీడియా ఎదుట ఆరోపించింది. భర్త చనిపోయినప్పటి నుండి ఆస్తి పంపకాల్లో జెడ్పీటీసీ తలదూర్చి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని ఆరోపించింది. పొలం పాస్ పుస్తకాలు రాకుండా రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రకాష్‌రెడ్డి అడ్డుకుంటున్నాడని, అదేమని ప్రశ్నిస్తే కోరిక తీర్చాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. దాచేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తనపై మాజీ మావోయిస్టు నర్సిరెడ్డి అనుచరులతో ప్రకాష్‌రెడ్డి దాడి చేయించారని ఎస్‌పికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. తనకు 2001వ సంవత్సరంలో ముత్యాలంపాడు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, అయితే 2006 సంవత్సరంలో తన భర్త క్యాన్సర్ వ్యాధితో మరణించినట్లు తెలిపింది. భర్త ద్వారా ఐదు ఎకరాల భూమి, ఇంటి స్థలం తన వంతుగా వచ్చాయని, గ్రామపెద్దగా ఉన్న జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, కొంతమంది పెద్దలు పంచాయతీ చేసి ఇద్దరు కుమార్తెలకు తనను గార్డియన్‌గా ఉంచి ఆస్తి ఆడపిల్లలకు చెందేవిధంగా పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంటు రాసినట్లు వివరించింది. తన భర్తకు జెడ్పీటీసీ వరుసకు బావమరిది అవుతాడని తెలిపింది. ఆస్తి మీద కనే్నసిన ప్రకాష్‌రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని, పరుష పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తన పిల్లలకు అపోహలు ప్రచారం చేస్తూ తనపై ద్వేషం పెంచుకునేలా ఉసిగొల్పుతున్నారని, మానసిక క్షోభకు గురవుతున్న తనకు న్యాయం చేయాలని కోరింది.