రాష్ట్రీయం

కష్టాలు చెప్పుకోవడానికే వచ్చా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: టీటీడీ విశ్రాంత ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. సుమారు గంటకుపైగా జగన్మోహనరెడ్డితో పలు విషయాలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు జగన్‌తో దీక్షితులు భేటీ అయ్యారు. అనంతరం రమణ దీక్షితులు విలేఖరులతో మాట్లాడుతూ మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాను... చట్టాలువల్ల టీటీడీలో చాలా కష్టపడుతున్నాం... మాకున్న సౌకార్యాలు తీసేశారు... మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు అని చెప్పారు. పలుమార్లు విజయవాడ వెళ్ళి వచ్చాం.. మా కష్టాలు వినలేదు... ఆకలిగా ఉన్నవాడు ఎవరు పెడతాన్నారనేది చూడడు... అన్నం పెడుతున్నాడా లేదా అన్నదే చూస్తాడు... మా కష్టాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని తీర్చమనండి... ఆయన ఫొటో మా ఇంట్లో పెట్టుకుంటా అని ఆవేశంగా అన్నారు. జగన్మోహనరెడ్డి తనకు న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.