రాష్ట్రీయం

అభివృద్ధి..సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 9: గడచిన నాలుగేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే ఏ ఊరు వెళ్లినా అత్యంత సంతృప్తిగా ఉందని, ఇది గొప్ప అనుభవమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం తెలియచెప్పేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు నవనిర్మాణ దీక్ష, మహా సంకల్పం చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడు రోజులు అన్ని గ్రామాల్లో ఇవే అంశాలు చర్చించుకున్నట్లు చెప్పారు. దాదాపు 16,355 గ్రామాల్లో గ్రామ నోడల్ అధికారులు, మండల, నియోజకవర్గ సమన్వయ అధికారులు ఈ కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా నిర్వహించినట్లు కొనియాడారు. ప్రతిరోజూ 30 నుంచి 35 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల పనితీరుని ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరూ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందినట్లు తెలిపారు. ఈ వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో జరిగిన కార్యక్రమంలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున 17,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశామని, ఎల్‌ఈడీ బల్బులు అమర్చి చరిత్ర సృష్టించామన్నారు. మరుగుదొడ్ల సమస్య పరిష్కరించామని,19లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో పెను మార్పులకు నాంది పలికామన్నారు. ఈ సందర్భంగా తమ అన్ని వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు వివరించారు. త్వరలో నిరుద్యోగ భృతి కూడా అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెంచామని తద్వారా రూ.500 కోట్లు వరకు విద్యుత్ ఆదా అయిందన్నారు. చంద్రన్న బీమాతో అయితే అనేక జీవితాలు వెలుగు నింపుకున్నాయన్నారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా వచ్చిన రూ.5లక్షలతో అప్పులు తీర్చుకుని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నట్లు తెలిపారు. మానవతా కోణంలో ఆలోచిస్తే ఈ విషయంలో తాను సరైన రీతిలో ఆలోచన చేసినట్లు సంతృప్తిగా ఉందన్నారు. 50 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంటే ఒక్క ఫిర్యాదు కూడా లేదన్నారు. అవినీతికి తావులేని పాలన అందిస్తున్నట్లు చెప్పారు. డ్వాక్రా మహిళలు అన్ని రకాలుగా ప్రజలకు సేవలందిస్తున్నారని వారిని కొనియాడారు. కళ్యాణ మిత్ర, బీమా మిత్ర, సాధికార మిత్ర వంటి కార్యక్రమాలకు వారు వేర్వేరుగా దుస్తులు ధరించి సేవాభావంతో ఎన్నో పనులు చేపడుతున్నారని చెప్పారు. భర్త వదిలేసిన ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపారు. సమాజంలోని అందరి అవసరాలను గుర్తించి అన్ని విధాల సహాయపడే పథకాలు అమలు చేస్తున్నామని, పౌర సేవలు సులభతరం చేసినట్లు తెలిపారు. ఈ వారం రోజులు తాను వెళ్లే దారిలో కొందరితో మాట్లాడానని, కొందరి ఇళ్లకు వెళ్లి లబ్దిదారులతో మాట్లాడానని, నేరుగా వారిని అడిగి వారు పొందిన లబ్ది గురించి తెలుసుకున్నానని చెప్పారు. ప్రతి కుటుంబానికి బాధ్యత గల పెద్దగా పనిచేశానన్నారు.
పోలవరం డయాఫ్రం వాల్ పూర్తయిందని, దీంతో ప్రాజెక్ట్ అండర్ గ్రౌండ్ పని పూర్తయిందని సీఎం చెప్పారు. ఇక వర్షాలు, వరదలు వచ్చినా పనులు ఆగవన్నారు. సోమవారం తాను పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళుతున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా నీటి ఎద్దడి తగ్గించినట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధి చెందుతోందని, అక్కడి చెరువుల్లో నీళ్లు చేరాయని తెలిపిన చంద్రబాబు ‘అంతకంటే ఆనందం ఏం కావా’లన్నారు. అడ్డంకులన్నిటినీ అధిగమించుతూ ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. బీజేపీతో కలిసినా, విభేదించినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రత్యేక హోదా ఇచ్చినా తక్కువేనన్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల నుంచి అనేక అడ్డంకులు ఎదుర్కొంటూ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఉన్నత విద్య, జేఈఈ, నీట్‌లలో రాష్ట్రం నెంబర్-1 అన్నారు. ప్రజల్లో సంతృప్తి 73 నుంచి 77 శాతానికి పెరిగిందన్నారు.