రాష్ట్రీయం

13నుంచి కొల్లాపూర్-బీదర్ మధ్య కొత్త రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: కొల్లాపూర్ ఛత్రపతి సాహూ మహరాజ్ టెర్మినస్ నుంచి బీదర్ వరకు వారానికి ఒకసారి నడిపే కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 13న ప్రారంభమవుతుందని ద.మ. రైల్వే తెలిపింది. పార్లమెంట్ సభ్యుడు ధనుంజయ్ భీమ్‌రావ్ మహాదిక్ ఈ నెల 13న కొల్లాపూర్‌లో జెండా ఊపి కొత్త రైలు ప్రారంభిస్తారని, తిరుగు ప్రయాణంలో బీదర్ నుంచి పార్లమెంట్ సభ్యుడు భగవంత్ కుబా బీదర్‌లో 14న జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొంది. ఈ రైలు మిరాజ్, పంఢాపూర్, కుర్దూవాడీ, ఉస్మానాబాద్, లాతూర్, లాతూర్ రోడ్, ఉద్గీర్, భాల్కీ స్టే షన్ల మీదుగా ప్రయాణిస్తుందని స్పష్టం చేసింది.