రాష్ట్రీయం

ఢిల్లీ దిగి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: ఢిల్లీ దిగివచ్చేలా, కడప ఉక్కు కర్మాగారం సాధించేలా ఆందోళన ఉద్ధృతం చేయాలని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ రవి చేపట్టిన నిరాహార దీక్షపై సోమవారం టెలీ కాన్ఫరెన్సులో జిల్లా నేతలతో మాట్లాడారు. దీక్షకు మద్దతుగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బుధవారం అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలన్నారు. గురువారం ఢీల్లీలో ఎంపీల దీక్ష చేపట్టాలని ఆదేశించారు. కడపకు ఉక్కు కర్మాగారం రాకుండా అడ్డుకున్న వాళ్లే ఇప్పుడు దీక్షపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమపై కేంద్రం రోజుకో ఒక మాట చెబుతోందన్నారు. పరిశీలిస్తున్నామంటూ ఉసరవెల్లి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ కోసం తుది వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు.