రాష్ట్రీయం

ముగిసిన జ్యేష్ఠ్భాషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 26: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన జ్యేష్ఠ్భాషేకం మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్‌దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠ్భాషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవారు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం నూతన స్వర్ణకవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణకవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అష్టదళపాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజియ్యర్ స్వామి, చిన్నజియ్యర్‌స్వామి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.