రాష్ట్రీయం

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న టీవీ చానళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: పథకం ప్రకారం హిందూ గ్రంథాలను, దేవీ దేవతలను అవమానపరుస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలను రూపొందించి కొన్ని చానళ్లు ప్రసారం చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ నేతలు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఒక వినతి పత్రం అందజేశారు. వీహెచ్‌పీ తెలంగాణ అధ్యక్షుడు ఎం రామరాజు, కార్య నిర్వహక అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, కార్యదర్శి ఎం.గాల్‌రెడ్డి, మీడియా ప్రతినిధి రావినూతల శశిధర్, బజరంగ్‌దళ్ ప్రతినిధి సుభాష్ చందర్, రమేష్, కైలాష్ తదితరులు డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన వినతి పత్రంలో టీవీ-9పై వారు ఫిర్యాదు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, కనుక ప్రభుత్వం స్పందించి, ఇటువంటి దుష్టశక్తులను కనిపెట్టి ఈ ఛానల్ అనుమతిని రద్దు చేయాలని కోరారు. డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించి తప్పకుండా అన్ని విషయాలూ సవివరంగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీవీ-9 ప్రసారం చేసిన కార్యక్రమాల జాబితాను డీజీపీకి ఇచ్చారు.