రాష్ట్రీయం
అండగా ఉంటాం చంద్రబాబు హామీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 15 July 2018
విజయవాడ: పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను తెలుసుకున్న సీఎం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎంవో అధికారి రాజవౌళిని అదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు కూడా దుర్ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేసిన ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య చికిత్సలను అందించి, పడవ ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.
చిత్రం...ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద వివరాలు తెలుసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీ